Thursday, May 9, 2024

కార్యకర్తలకు అండగా టిఆర్ఎస్ పార్టీ: పెద్దపల్లి ఎమ్మెల్యే

ప్రతి ఒక గులాబీ సైనికుడికి టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పెద్దపల్లి మండలం పాలితం గ్రామానికి చెందిన టీఆర్ ఎస్ పార్టీ కార్యకర్త గొట్టం రాజేశం ప్రమాదవశాత్తు మరణించగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ ప్రమాద భీమా ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మంజూరైన చెక్కును మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆదేశాల మేరకు స్వయంగా కార్యకర్త ఇంటికి వెళ్లి రెండు లక్షల రూపాయల చెక్కును గొట్టం రాజమల్లమ్మ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఛైర్మెన్ దాసరి చంద్రారెడ్డి, రైతు బంధు మండలాధ్యక్షుడు ఆనంతరెడ్డి, సర్పంచ్ పద్మ-రవీందర్, ఎంపీటీసీ లక్ష్మీ-రాజేశం తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement