Friday, May 17, 2024

రోడ్ల నిర్మాణానికి 25 కోట్లు కావాలే.. మంత్రి కేటీఆర్‌ను కోరిన ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి నియోజకవర్గంలో బీటీ రోడ్ల నిర్మాణం కోసం 25 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు వినతి పత్రం అందించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో మంత్రిని కలిసి డిఎంఎఫ్టీ నిధుల నుండి నియోజకవర్గంలో 13 బిటిరోడ్ల నిర్మాణానికి 25 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని, గ్రామాల మధ్య రోడ్డు సౌకర్యం లేక ప్రజలు వర్షాకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని నియోజకవర్గ ప్రజల పక్షాన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు
ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement