Monday, May 6, 2024

అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూం ఇండ్లు: ఎమ్మెల్యే చల్లా

హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండలం చర్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన 76 డబుల్ బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా 76 గృహాల లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశం చేయించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. త్వరలోనే ఎవరి సొంత స్థలాల్లో వారు ఇండ్లు నిర్మించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement