Wednesday, May 1, 2024

ఎన్నో సంవత్సరాల క‌ల సాకారం అవుతుంది…ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్…

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి ( సెప్టెంబర్ 7)ప్రభ న్యూస్… ఉమ్మడి పాలమూరు ప్రజల సహకారం తో ఎన్నో ఏళ్ల తాగు సాగునీరు కల కెసిఆర్ నెరవేర్చబోతున్నార‌ని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆనందం వ్యక్తం చేశారు. గురువారం కొల్లాపూర్ నియోజకవర్గంలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభ నార్లాపూర్ కు సందర్శించారు ప్రపంచం లోనే సామర్థ్యం కలిగిన మోటర్లు నెలకొల్పి పాలమూరు రంగారెడ్డి ద్వారా ఉమ్మడి పాలమూరు ప్రజలకు నీరంధించ‌నున్నార‌ని అన్నారు..

అపర భగీరథుడు కేసీఆర్ పాలనలో
త్రాగు నీరు సాగు నీరు సమృద్ధిగా ఉండటంతో ఈ ప్రాంతానికి వలసలు అధిక సంఖ్యలో వస్తున్నారని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లా లో ఒక్కరు వలస వెళ్లకూడదనేది కేసీఆర్ ఆదేశం మని తెలిపారు. నాడు 14 రోజులకు ఒకసారి నీరు వచ్చెవని, నేడు రోజు నీరు సమృద్ధిగా ఉంటుందని వెల్లడించారు.

కొల్లాపూర్ అచ్చంపేటకు
పర్యాటక రంగం గా అభివృద్ధి చెందబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ను 14 మంది స్థానిక శాసనసభ్యులు కాపాడుకుంటామని తెలియజేశారు. తనతోపాటు. ప్రభుత్వ విప్ డాక్టర్ గువ్వల బాలరాజు , జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ఎస్పీ కే మనోహర్, ప్రభుత్వ విప్పు గువ్వల బాలరాజు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement