Tuesday, May 21, 2024

bhopal: ఓటేస్తే వ‌జ్ర‌పు ఉంగ‌రాలు..

బంప‌ర్ బ‌హుమ‌తిని ప్ర‌క‌టించిన మ‌ధ్య ప్ర‌దేశ్
ఓట్ల శాతాన్ని పెంచేందుకు గిప్ట్ తాయిలం
7వ తేదిన ఓటేసిన వారి పేర్ల‌తో ల‌క్కీ డ్రా
గిఫ్ట్ ల జాబితాలో టీవీలు,ప్రిడ్జ్ , సెల్ ఫోన్లు, స్టీల్ సామాన్లు

భోపాల్ – దేశంలో విడతల వారీగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు ఎండదెబ్బ బాగానే తగులుతోంది. నిప్పులు చెరుగుతున్న సూర్యుడి దెబ్బకు బయటకు రావాలంటేనే భయపడుతున్న ప్రజలు ఓటింగ్‌కు దూరంగానే ఉంటున్నారు. ఉదయం పది తర్వాత నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ బూత్‌లు బోసిపోతున్నాయి. దీంతో ఓటింగ్ శాతం దారుణంగా పడిపోతోంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల పోలింగ్ శాతమే ఈ విషయం చెబుతోంది.

ఈ నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ఈనెల 7న మూడో విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు లక్కీ డ్రాను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఓటింగ్‌లో పాల్గొన్న వారికి కూపన్ ఇస్తారు. ఆ తర్వాత లక్కీ డ్రా నిర్వహిస్తారు.

- Advertisement -

అందులో గెలుపొందిన వారికి డైమండ్ ఉంగరాలు, టీవీలు, ఫ్రిడ్జ్, సెల్ ఫోన్లు, స్టీల్ సామానుల‌తో పాటు, ఇతర వస్తువులు అందిస్తామని అధికారులు ప్రకటించారు. పోలింగ్ రోజు ఉదయం ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఉదయం 10గంటలు, మధ్యాహ్నం 3 గంటలు, సాయంత్రం 6 గంటలకు లక్కీ డ్రా నిర్వహిస్తారు. విజేతకు అక్కడే బహుమతిని అందిస్తారు. ఆ తర్వాత రెండు మూడు రోజులకు మెగా డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement