Wednesday, May 15, 2024

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని – కలిసిన ఆర్య వైశ్య నూతన కార్యవర్గం

ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభకు నూతనంగా ఎన్నికైన కార్యవర్గం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి మంత్రి పువ్వాడ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య సంఘాల JAC అధ్యక్షులు డాక్టర్ పులిపాటి ప్రసాద్ ,జేఏసీ కన్వీనర్ కొత్త వెంకటేశ్వర రావు , ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిన్ని కృష్ణారావు , వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ మాజీ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ 45వ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు గుమ్మడవెల్లి శ్రీనివాస్ , ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య సంఘ మాజీ కార్యదర్శి కొద్దుమూరి మధుసూదన్ , తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులు కొదుమూరు జగన్నాధం , వాసవి క్లబ్ రోటరీ నగర్ అధ్యక్షులు మాశెట్టి వరప్రసాద్ ,

ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలు ఈశ్వరి , వాసవీక్లబ్స్ జిల్లా ఇంచార్జ్ కుమ్మరికుంట్ల శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శి కూరా శ్రీనివాస్ , రేడియో షాప్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పోలా హరినాథ్ , ఆర్యవైశ్య ఉద్యోగ సంఘాల నుండి పాల్వాయి వెంకటేశ్వర్లు, ఎచ్చా రామకృష్ణ దాచేపల్లి రామకృష్ణ , 49 వ డివిజన్ టిఆర్ఎస్ సెక్రటరీ వేముల వెంకట సుదీర్ ,సాయి గణేష్ నగర్ బోనకల్ రోడ్డు క్లబ్ అధ్యక్షులు చేరుకున్న, తేలు కుంట్ల ధనంజయ , నాళ్ళ వేంకటేశ్వరరావు , విశ్వనాథం , ఎస్ వెంకటేశ్వర్లు , కొదుమ్మూరు నాగేశ్వరావు , బిక్షమయ్య , మోహన్ రావు , మరియు ఇతర మండలాల నుండి వచ్చిన ఆర్యవైశ్య మిత్రులు లైన్స్ క్లబ్ నుండి గుంటుపల్లి దివాకర్ గుప్తా , ఆత్మకూరు వెంకట రామారావు , ఆంజనేయస్వామి టెంపుల్ మాజీ చైర్మన్ బచ్చు మురళి కృష్ణ , ఇతర ఆర్యవైశ్య సోదరులు పెద్ద ఎత్తున మంత్రి గారిని కలిశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఖమ్మం నగర ఆర్య వైశ్య మహాసభ రూపొందించిన 2022-క్యాలెండ‌ర్ ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆవిష్కరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement