Saturday, May 4, 2024

యాదాద్రికి 3 కిలోల బంగారం.. మంత్రి మల్లారెడ్డి భారీ విరాళం

యాదాద్రి శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహాస్వామి ఆల‌య విమాన గోపురం బంగారం తాప‌డం కోసం మంత్రి మ‌ల్లారెడ్డి భారీ విరాళాన్ని అందించారు. 3 కిలోల బంగారం కొనుగోలకు కోసం న‌గ‌దును ఆల‌య అధికారుల‌కు మంత్రి మ‌ల్లారెడ్డి అంద‌జేశారు. మంత్రి మ‌ల్లారెడ్డి మొత్తం రూ. 1.75 కోట్ల న‌గ‌దు అందించారు. ఇందులో రూ. కోటి నగదు కాగా, రూ. 75 లక్షల విలువైన చెక్కులు ఉన్నాయి. మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం త‌ర‌పున మూడు కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చిన‌ట్లు మంత్రి మల్లారెడ్డి చెప్పారు. త‌న కుటుంబం త‌ర‌పున కిలో బంగారం, నియోజ‌క‌వ‌ర్గం టీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున 2 కిలోల బంగారం స‌మ‌ర్పించిన‌ట్లు మంత్రి మ‌ల్లారెడ్డి వివరించారు.

ఇది కూడా చదవండి: agriculture: వరి వద్దంటిరి.. మరేం పంటలు వేయాలే.. అధికారులకు ఎదురవుతున్న అతి పెద్ద సవాల్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement