Monday, May 20, 2024

నేడు నాగర్‌కర్నూల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన

తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఈరోజు నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ పట్టణాలలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కొల్లాపూర్‌లో సింగోటం నుంచి గ్రావిటీ ద్వారా తీసుకెళ్లే రూ.147 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు కొల్లాపూర్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపడతారు.

మధ్యాహ్నం ఒంటి గంటకు రాజాగారి బంగ్లా ముందు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం నాగర్ కర్నూల్ చేరుకుంటారు. మినీ టాంక్ బండ్, మిషన్ భగీరథ పైలాన్, ఆడిటోరియం, వెజ్-నాన్ వెజ్ మార్కెట్‌కు శంకుస్థాపన చేస్తారు. నూతనంగా నిర్మించిన మున్సిపల్ బిల్డింగ్ను ప్రారంభిస్తారు. బిజినేపల్లిలో ఎంపీడీఓ భవనం ప్రారంభిస్తారు. శాయిన్ పల్లి రూ.76 కోట్లతో నిర్మించనున్న మార్కండేయ రిజర్వాయర్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement