Sunday, April 28, 2024

Secunderabad: ప్రారంభానికి సిద్ధమైన డ‌బుల్ బెడ్రూం ఇండ్లు

సికింద్రాబాద్ లోని వెస్ట్ మారేడ్‌ప‌ల్లిలో నూత‌నంగా నిర్మించిన 468 డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభానికి సిద్ధమైయ్యాయి. ఈ నెల 3వ తేదీన ఉద‌యం 9:30 గంట‌ల‌కు రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించ‌నున్నారు. ఈ మేరకు మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ వెల్లడించారు.  మొత్తం 5.18 ఎకరాల విస్తీర్ణంలో 36.27 కోట్ల రూపాయల వ్యయంతో డబుల్ బెడ్రూం ఇండ్ల‌ను నిర్మించారు. రూ. 3.51 కోట్ల వ్యయంతో రోడ్లు, డ్రైనేజి, విద్యుత్ సౌకర్యాలు కల్పించామ‌ని తెలిపారు. మంచినీటి సౌకర్యం కోసం 50 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన 4 సంపులను నిర్మించిన‌ట్లు వివ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement