Sunday, May 19, 2024

మంత్రి సత్యవతి రాథోడ్ ను పరామర్శించిన మంత్రి కేటీఆర్

తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలో ఆదివారం మంత్రి కేటీఆర్ సత్యవతి రాథోడ్ ను పరామర్శించారు. లింగ్యా నాయక్‌ చిత్ర పటానికి మంత్రి కేటీఆర్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంనతరం మంత్రి సత్యవతిని ఓదార్చారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement