Monday, May 6, 2024

యువతకు తెలంగాణ వైతాళికులు ఆదర్శం: మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ వైతాళికులను గౌరవించుకోడం మన కర్తవ్యమని, నేటి యువత దాశరథిని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. తెలంగాణ సాహితీ సౌరభం దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని సగర్వంగా ప్రకటించి, తెలంగాణలో ఉద్యమ చైతన్యం కలిగించిన గొప్ప కవి, ఉద్యమకారుడు దాశరథి కృష్ణమాచార్యులు అని అన్నారు. అగ్నిధార పేరుతో ప్రజలను జాగృతం చేశారని తెలిపారు. సాహిత్య రంగంలో దాశరథి సేవలకు గుర్తుగా తెలంగాణ ప్రభుత్వం ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నదని, దాశరథి పేరుతో అవార్డును అందిస్తున్నదని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement