Tuesday, April 30, 2024

మంత్రి వేములకు జన్మదిన శుభాకాంక్షలు

మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆయనకు శుభాకాంక్షులు వెల్లువెత్తుతున్నాయి. మంత్రుల నివాసంలోని ప్రశాంత్ రెడ్డి ఇంటికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపిలు రంజిత్ రెడ్డి, వెంకటేష్, టీఆర్ఎస్ నేతలు వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయిలు తినిపించారు. ప్ర‌జా ప్ర‌తినిధిగా, మంత్రిగా, అసెంబ్లీ వ్య‌వ‌హారాల నిర్వ‌హ‌ణ‌లోనూ మంచి ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్నందుకు అభినందించారు. అలాగే, వేముల ప్ర‌శాంత్ రెడ్డి సుదీర్ఘ రాజ‌కీయ జీవితంలో ఉండాల‌ని, ప్ర‌జాసేవ చేయాల‌ని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement