Wednesday, May 8, 2024

శృంగ దర్శనం!

శివాలయంలోకి అడుగు పెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుని చూస్తే, మరి కొం దరు ఆయన చెవిలో తమ అభీష్టాలను కొంటారు. నంది పర మేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యత వచ్చిందా? అపరమేశ్వరుడికి అనుంగుభక్తుడు నందీశ్వరుడు. అందుకనే ఆలయకారకుడు నంది ని తన వాహనంగా చేసుకున్నాడు. ప్రతి శివాలయంలోనూ శివ లింగానికి ఎదురుగా నంది విగ్ర హం వుంటుంది. ఆలయంలోని మూలవిరాట్టు దర్శనం చేసుకొనే సమయంలో మనస్సుని భగవంతునిపై కేంద్రీకరించాలి. అందుకే గర్భాలయంలో చాలా చిన్న అఖండ దీపారాధన మాత్రమే వాడతారు. మరే ఇతర దేవాలయాలలోనూ లేని విధంగా శివాలయంలో మాత్రమే నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తారు.
సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఆలయానికి ప్రదక్షిణ చేసి పరివార (ఇ తర) దేవతల దర్శనం చేసి పరమశివున్ని దర్శించుకుంటాము. కొందరు భక్తులు నందీశ్వరు నికి నమస్కరించి వెళ్ళిపోతారు. కానీ అది అసంపూర్ణం దర్శనం అని శాస్త్రములు చెబుతు న్నాయి.
పరమ శివుడు ఏ శివాలయంలో అయిన శివలింగ రూపంలో ఉంటాడు. అంటే ఇతర దేవ తలలాగ కరచరనాదులు (విగ్రహరూపం) లేకుండా లింగాకారంగా ఉండే సాకార స్వరూపం.
విగ్రహ రూపంలో ఉండే భగవంతుని స్వరూపంను మనస్సు వెంటనే గ్రహించగలదు కానీ, లింగరూపంలో ఉన్న పరమశివుడిని చూస్తూ స్వామి నిజ రూపాన్ని దర్శించడానికి దృష్టిని మనస్సు పై కేంద్రీకృతం చేయాలి.
అందుకే ఎప్పుడూ పరమశివుడి ముందు ఉండే నంది శృంగము (కొమ్ముల) నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనస్సు పై కేంద్రీకరింఛి దర్శనం చేసుకోవాలి. నంది యొక్క పృష్ట భాగంను నిమురుతూ శృంగముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వలన నంది అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి.
అంతేకాకుండా నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది. కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి, నెమ్మదిగా గోత్రము, పేరు, కోరిక చెప్పడం మంచిది.
శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి. ఆ గురు, శిష్యుల మధ్య ఎవరూ వెళ్ల కూడదు. అందుకనే నంది విగ్ర#హం పైన కొమ్ముల మధ్యనుంచి శివదర్శనం చేసుకోవాల్సి వుంటుంది. శంభుడు త్రినేత్రుడు. ఆయన త్రినేత్రం తెరిస్తే సకలా చరాచర జగత్తు తల్లడిల్లు తుంది అందుకనే నేరుగా శివుని ముందుకు వెళ్లకూడదని పెద్దలు చెబుతారు. దీంతో ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే మంది రం లోపలికి వెళ్లాలి. దీన్నే శృంగదర్శనం అంటారు.
రాశి చక్రంలోని మిథున రాశి గౌరీ శంకర స్వరూపం. వృషభరాశి నందీశ్వర రూపం. రాశి చక్రం ఉదయించే సమయంలో వృభరాశి, మిథున రాశి కిందుగా, అస్తమించే సమయంలో మిథునరాశి, వృషభరాశి కిందుగాను ఉంటుం ది. ఆ కారణం వలనే శివుడు వృషభ వాహనుడు, వృషభద్వజుడు అయ్యాడు. వృషభం (నందీశ్వరుడు) యొక్క వృషభ బాగాన్ని స్పృశిస్తూ శివుని దర్శించిన వారికి కైలాసప్రాప్తి కలుగు తుందని శివ పురాణం చెబుతుంది. భక్తుల విశ్వాసం.

  • డా. చదలవాడ హరిబాబు
    9849500354
Advertisement

తాజా వార్తలు

Advertisement