Saturday, May 18, 2024

కెసిఆర్ నిండు నూరేళ్లు జీవించాలి: మంత్రి కొప్పుల

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సంపూర్ణ ఆరోగ్యవంతులై ఆయురారోగ్యాలతో నిండూ నూరేళ్లు జీవించాలని భగవంతున్ని వేడుకున్నట్లుగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సోమవారం కెసిఆర్ ఆరోగ్యంగా ఉండాలని మంత్రి సత్యవతి రాథోడ్ బంజారాహిల్స్లోని మంత్రుల నివాసంలో నిర్వహించిన మృత్యుంజయ హోమానికి హాజరైయ్యారు. ఈ సందర్భంగా తీర్థ ప్రసాదాలు స్వీకరించి,వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తున్న కెసిఆర్ సల్లగా ఉండాలని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement