Sunday, April 28, 2024

Yadagirigutta – చిరు ధాన్యాల ప్ర‌సాద విక్ర‌యాల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ శ్రీకారం ..

యాదగిరిగుట్టలో చిరుధాన్యాల ప్రసాదం , స్వామి వారి బంగారు, వెండి నాణేల విక్రయాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ ద‌శాబ్ది ఉత్స‌వాల సందర్భంగా ఆల‌యంలో నిర్వ‌హించిన ఆధ్యాత్మిక దినోత్స‌వ వేడుక‌ల‌లో మంత్రి పాల్గొన్నారు.. ముందుగా అంతకుముందు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన మంత్రికి దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఆలయ ఈఓ, అర్చకులు స్వాగతం పలికారు. శ్రీవారి ప్రధాన ఆలయంలో స్వయంబు దేవుడిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు మంత్రిని ఆశీర్వదించగా, ఆలయ ఈవో శ్రీస్వామివారి ప్రసాదాన్ని అందచేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 3 గ్రాముల బంగారం డాలరు రూ.21,000/-, 5 గ్రాములు వెండి రూ. 1,000/- 80 గ్రాముల మిల్లెట్ ప్రసాదం రూ. 40./- నిర్ణయించినట్లు తెలిపారు. అదే విధంగా భక్తుల సౌకర్యం కోసం వెబ్ పోర్టల్ ను ఆవిష్కరించి, ఆన్ లైన్ టికెట్ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. అనంతరం వృద్దులు, వికలాంగుల కోసం రూ.21 లక్షల వ్యయంతో 3 బ్యాటరీ వాహనాలను అందుబాటులోకి తెచ్చామని ఆన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొంగిడి సునీత రెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, YTDA వైస్ చైర్మన్ కిషన్ రావు, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement