Sunday, April 28, 2024

Breaking: జెడ్పీ స్టాండింగ్‌ కమిటీల‌ భేటీ.. ఎల్లుండి నుంచి రెండ్రోజుల‌పాటు మీటింగ్స్‌

ప్రభన్యూస్‌బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా జెడ్పీ స్టాండింగ్‌ కమిటీ సమావేశాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈనెల 23, 24 తేదీల్లో ఖైరతాబాద్‌లోని జెడ్పీ కార్యాలయంలో సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 23న మహిళా శిశుసంక్షేమం, వ్యవసాయం, సాంఘిక సంక్షేమ శాఖల పనితీరుపై సమీక్ష చేయనున్నారు.

24వ తేదీన‌ ప్రణాళిక, పనులు, ఆర్థిక శాఖపై సమీక్షించనున్నారు. గ్రామీణాభివృద్ధి, విద్యావైద్య శాఖలపై కూడా స‌మీక్ష ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ తీగల అనితారెడ్డి అధ్యక్షతన ఈ స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు జరగనున్నాయని, సకాలంలో జిల్లా అధికారులు, కమిటీ సభ్యులు హాజరుకావాలని జెడ్పీ ముఖ్య కార్యనిర్వాహణాధికారి దిలీప్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement