Friday, May 3, 2024

50 వేల మంది డాక్ట‌ర్ల నియామ‌కానికి కెసిఆర్ నిర్ణ‌యం..

వైద్య సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గించేందుకు నిర్ణయం
ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వారి నుండి దరఖాస్తులు తీసుకోండి
సేవకు ముందుకు రావాలని సీఎం పిలుపు
కేంద్ర మంత్రి హర్షవర్దన్‌కు సీఎం ఫోన్‌
కరోనా స్ప్రెడర్‌లకు ముందు టీకాఇస్తే బాగుంటుందని కీలక సూచన
వైద్య సేవలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌, : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా పనిచేస్తున్నరాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పని వత్తిడి తగ్గించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 వేల మంది ఎంబీబీఎస్‌ పూర్తిచేసి సిద్ధంగా వున్న అర్హు లైన వైద్యులనుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని నిర్ణయిం చారు. రెండు, మూడు నెలల కాలానికి డాక్టర్లు, నర్సులు, లాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్‌ సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని, కరోనా వైద్యంలో వారి సేవలను వినియోగించుకోవాలని సిీఎం కేసీఆర్‌ వైద్యాధికారులను ఆదేశించారు. వీరికి గౌరవ ప్రదమైన రీతిలో జీతాలు అందించాలని అన్నారు. అంతేకాకుండా.. వారు కరోనా వంటి కీలక సమయంలో రాష్ట్రం కోసం పనిచేస్తున్నందున వారి సేవలకు సరియైన గుర్తింపునివ్వాలన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వారికి వెయిటేజీ మార్కులను కలపాలని సిీఎం ఆదేశించారు. కష్టకాలంలో ప్రజలకోసం సేవచేయ డానికి ముందుకు రావాలని
యువ డాక్టర్లకు సిఎం కెసిఆర్‌ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి ఆసక్తి వున్నవాల్లు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సిీఎం తెలిపారు. https://odls.telangana. gov.in/medicalrecruitment/Home.aspx.. డాక్టర్లతో పాటు రాష్ట్రంలో అర్హతవున్న నర్సులు, లాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్‌ సిబ్బంది ముందుకు రావాలని సిఎం పిలుపునిచ్చారు.
వరంగల్లు అదిలాబాద్‌లలో సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన్ల ప్రారంభం
వరంగల్‌, అదిలాబాద్‌ జిల్లాల్లో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను తక్షణమే ప్రారంభించాలని, వైద్య సిబ్బందిని నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కాకతీయ మెడికల్‌ కాలేజీ ఆవరణలో నిర్మించిన ఎంజిఎంకు చెందిన 250 పడకల సూపర్‌ స్పెషాలిటీ దవాఖానను, అదిలాబాద్‌ జిల్లా రిమ్స్‌’ లోని మరో 250 పడకల సూపర్‌ స్పెషాలిటీ దవాఖానను తక్షణమే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పిఎంఎస్‌ఎస్‌వై కింద ఎంజిఎంలో నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ నిర్మాణానికి ప్రభుత్వ వాటాకింద తక్షణం అందచేయాల్సిన 8 కోట్ల రూపాయలను, రిమ్స్‌లో ఇదే పథకం కింద నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ దవాఖానకు ప్రభుత్వ వాటాకింద 20 కోట్ల రూపాయలను, మొత్తం 28 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. అదే సందర్భంలో వరంగల్‌ దవాఖానా కోసం 363 వైద్య సిబ్బందిని, అదిలాబాద్‌ రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ కోసం 366 మంది వైద్యసిబ్బందిని, మెత్తం 729 సిబ్బంది నియామకానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని వైద్యాధికా రులను సిఎం ఆదేశించారు.రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై ఆదివారం ప్రగతిభవన్‌లో సిీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వ#హంచారు. ఈ సమావేశంలో మంత్రులు తన్నీరు #హరీష్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కోవిడ్‌ సీఎంఓ ప్రత్యేక అధికారి రాజశేఖర్‌ రెడ్డి, ##హల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస రావు, డీఎంఈ కె.రమేష్‌ రెడ్డి, కాళోజి ##హల్త్‌ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌ రెడ్డి, టి ఎస్‌ఎంఎస్‌ఐడిసి ఎండీ చంద్ర శేఖర్‌ రెడ్డి, టెక్నికల్‌ అడ్వైజర్‌ గంగాధర్‌ తదిత రులు పాల్గొన్నారు. ఈ సమీక్ష సందర్భంగా… రాష్ట్రంలో ఆక్సీజన్‌, రెమిడిసివర్‌ ఇంజక్షన్లు, బెడ్లు, ఇతర కరోనా సౌక ర్యాల పరిస్థితి గురించి అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు.
ఆక్సిజన్‌, మందుల కొరత లేదు
రాష్ట్రంలో ఆక్సీజన్‌ కొరత లేదని, రెమిడిసివర్‌ ఇంజక్షన్లు అందుబాటులోనే వున్నాయని, ఇతర మందులన్నింటినీ సిద్దంగా ఉంచామని వైద్యారోగ్య శాఖ అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. ప్రభుత్వ దవాఖాన్లలలో మెత్తం 7393 బెడ్లు అందుబాటులో వున్నాయని, 2470 ఆక్సీజన్‌ బెడ్లు, 600 వెంటిలేటర్‌ బెడ్లు కూడా సిద్దంగా వున్నాయని తెలిపారు. మందులతో పాటు, వైద్య బృందాలు ఎల్లవేళలా అందుబాటులో వున్నాయన్నారు. కాగా ప్రయివేటు దవాఖా నాల్లో రెమిడిసివర్‌ ఇంజక్షన్లను మరింతగా అందుబాటు లోకి తెచ్చే ఏర్పాట్లను చేయాలని సీఎం సూచించారు.
కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్‌కు సీఎం ఫోన్‌
సమీక్ష సందర్బంగా ముఖ్యమంత్రి, కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్‌తో ఫోన్లో మాట్లాడారు. కరోనా నియంత్రణ కోసం రాష్ట్రం చేపడుతున్న చర్యలను సిీఎం వివరించారు. కరోనాను నియంత్రించే క్రమంలో తీసుకోవా ల్సిన చర్యలగురించి సీఎం కేంద్ర మంత్రికి కొన్ని విలువైన సూచనలు చేశారు. కరోనా వ్యాప్తిని పెంచే అవకాశం వున్న ‘అతివేగంగా వ్యాప్తి కారకులను’ గుర్తించి వారికి ముందు వరసలో టీకాలు వేస్తే బాగుంటుందని సూచించారు. ఆటో డ్రైవర్లు, క్యాబ్‌ డ్రైవర్లు, కండక్టర్లు, గ్యాస్‌ బాయ్స్‌, స్ట్రీట్‌ వెండార్స్‌, ఇంకా పలు దిక్కులకు పోయి పనిచేసే కార్మికులు తదితరులను కరోనా వ్యాప్తి అధికం చేసే అవకాశాలున్న వారిగా ప్రత్యేక కేటగిరీ కింద గుర్తించి వాక్సిన్‌ను అందచేసేందుకు నిబంధనలను సడలించాలన్నారు. ఆ వెసులుబాటును రాష్ట్రాలకు కల్పించడం ద్వారా కరోనా వ్యాప్తిని అధికభాగం అరికట్టే అవకాశముంటుందని సీఎం తెలిపారు. సిఎం సూచనలమీద సానుకూలంగా స్పందించిన కేంద్రం మంత్రి ప్రధానితో చర్చించి ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

మీ సూచ‌న‌లు భేష్ – కెసిఆర్ కి మోడీ అభినంద‌న‌లు

వ్యాక్సిన్‌ ముందుగా క్యాబ్‌, ఆటోడ్రైవర్లు, వీధి వ్యాపారులకు వేయాలని సీఎం కేసీఆర్‌ చేసిన సూచనను ప్రధాని మోడీ అభినందించారు. ప్రగతిభవన్‌లో సమీక్షా సమావేశానం తరం సీఎం కెసీఆర్‌తో ప్రధాని నరేంద్ర మోడీ ఫోను కాల్‌లో మాట్లాడారు. సమీక్ష సందర్భంగా సీఎం చేసిన సూచనలను కేంద్ర మంత్రి హర్షవర్దన్‌ తనకు వివరించారని ప్రధాని సిఎంకు తెలిపారు. ”మీది మంచి ఆలోచన, మీ సూచనలు చాలా బాగున్నాయి. వాటిని తప్పకుండా ఆచరణలో పెడుతాం.. మీ సూచనలకు అభినందనలు” అంటూ ప్రధాని సీఎం కేసీఆర్‌ను అభినందించారు. రాష్ట్రానికి మరింతగా ఆక్సీజన్‌, రెమిడిసివర్‌ ఇంజక్షన్లు సరఫరా చేయాలని సీఎం కేసీఆర్‌ ప్రధానికి ఈ సందర్భంగా విజ్జప్తి చేశారు. సిీఎం చేసిన విజ్జప్తికి ప్రధాని సానుకూలంగా స్పందించారు. అందుకు సంబంధించి సత్వరమే చర్యలు చేపడతామని సీఎం కు హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement