Thursday, May 2, 2024

మృతుని కుటుంబానికి పరామర్శ..

రాయపోల్ : మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ ఎక్కాల యాదగిరి గుండెపోటుతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న జడ్పీటీసీ.. యాదగిరి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే రూ.5వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ ఎక్కాల మల్లేశ్‌, మన్నె ఆంజనేయులు, స్వామి, రాజు, ఆంజనేయులు, మధు, రాజనర్సింలు, రాజారాం, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement