Saturday, April 27, 2024

Sangareddy: లాడ్జిలో గుర్తుతెలియని మహిళ మృతి

పటాన్ చెరు పట్టణంలోని బస్టాండ్ సమీపంలోని గణపతి లాడ్జ్ లో గుర్తు తెలియని మహిళ (45) మృతదేహం ఉండడంతో గణపతి లాడ్జ్ కు సంబంధించిన నిర్వాహకులు వెళ్లి చూడగా.. అక్కడ మృతి చెందిన మహిళను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఓ వ్యక్తితో వచ్చిన మహిళ తెల్లవారేసరికి బెడ్ పై విగతజీవిగా పడి ఉండడంతో ఉలిక్కిపడ్డ సిబ్బంది వెంటనే గణపతి లాడ్జ్ నిర్వాహకులు, పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వెంటనే క్లూస్ టీంను పిలిపించి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పటాన్ చెరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement