Sunday, April 28, 2024

వర్షాలకు ఇల్లు కూలిన కుటుంబానికి పరామర్శ.. ఆర్థిక సాయం అందజేత

సదాశివపేట, ప్రభ న్యూస్.. గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా 25వ వార్డులో గురువారం రాత్రి డి చంద్రశేఖర్ ఇల్లు కూలిపోవడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ తనయుడు బీఆర్ఎస్ నాయకులు చింత సాయినాథ్ చంద్రశేఖర్ ఇంటిని పరిశీలించి, మానవతా దృక్పథంతో ఇంటి యజమాని చంద్రశేఖర్ కు పదివేల రూపాయలు తక్షణమే సాయం చేయడం జరిగింది. ప్రభుత్వం తరఫున కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, అశోక్, వీరేష్, మల్లికార్జున్, వేణు, వీరన్న, అఖిల్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement