Wednesday, May 8, 2024

కారు – లారీ ఢీ – ఇద్దరు దుర్మరణం

సంగారెడ్డి: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.జహీరాబాద్‌లోని బీదర్ రోడ్ రైల్వేగేటు వ్దద శుక్రవారం ఉదయం ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు..

.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన వారిని కర్ణాటక చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement