Monday, April 29, 2024

వైఎస్ షర్మిల హౌజ్ అరెస్టు – గజ్వేల్ పర్యటనకు బ్రేక్

హైదరాబాద్ – వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హౌజ్ అరెస్టు అయ్యారు. ఆమె గజ్వేల్ పర్యటనకు వెళ్లాలి అనుకున్నారు. గజ్వేల్‌లోని తీగుల్ గ్రామంలో ప్రజలను కలవాలని షర్మిల ప్లాన్ చేసుకున్నారు..ఆ గ్రామంలో కొందరు లబ్దిదారులు.. తమకు దళిత బంధు మనీ అందలేదని ఆరోపించారు. దీనిపై వారితో మాట్లాడేందుకు షర్మిల అక్కడికి వెళ్లాలి అనుకున్నారు.

ఐతే.. ఆమె పర్యటన వల్ల శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది అని భావించిన పోలీసులు.. ఉదయమే లోటస్ పాండ్‌కి వెళ్లి.. ఆమెను బయటకు రానివ్వకుండా హౌస్ అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement