Sunday, April 28, 2024

రెండు లైన్ల రింగు రోడ్డు.. సిద్ధిపేట మెడలో హారం : మంత్రి హ‌రీష్‌

చిన్నకోడూర్ : రెండు వరుసల రింగురోడ్డు సిద్ధిపేటకు వర‌మ‌ని, సిద్ధిపేట మెడలో హారంలా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.. సిద్ధిపేట జిల్లా మండల కేంద్రమైన చిన్నకోడూర్ లో ఆర్అండ్ బీ రింగు రోడ్డు నిర్మాణ పనులకు జెడ్పీ చైర్మన్ రోజా శర్మతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడారు. రెండు వరుసల రింగురోడ్డు సిద్ధిపేటకు వర‌మ‌ని, సిద్ధిపేట మెడలో హారంలా ఉంటుంద‌న్నారు. 20 ఏళ్ల క్రితం సిద్ధిపేట నియోజకవర్గంలో బుస్సాపూర్ నుంచి తిమ్మాయిపల్లి వరకూ సింగిల్ రింగురోడ్డును ఆనాడే కేసీఆర్ వేయించారని, సీఎం కేసీఆర్ ముందుచూపు వల్లనే ఇది సాధ్యమైందని మంత్రి హరీశ్ రావు వెల్లడి. రెండు వరసలు రింగురోడ్డు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి సిద్దిపేట ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాన‌న్నారు. రాజీవ్ రహదారి టూ రాజీవ్ దహదారిని అనుసంధానం చేసుకుంటూ సిద్ధిపేట చుట్టూ వలయంగా రింగ్ రోడ్డు ఎంతగానో దోహదపడుతుంద‌న్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా.. సిద్ధిపేటకు రావాల్సినది లేకుండా ఈ రెండు వరుసల రహదారి నిర్మాణం చేపడుతున్నామ‌న్నారు. మొత్తం 88 కిలో మీటర్ల మేర రూ.160కోట్లతో రింగురోడ్డు వేస్తున్నాం.

ఈ రింగురోడ్డు వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెంది పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. 7 మండలాలైన కొండపాక, తొగుట, దుబ్బాక, సిద్ధిపేట రూరల్, నారాయణరావుపేట, చిన్నకోడూర్, నంగునూరు పరిధి మీదుగా 88 కిలో మీటర్ల విస్తరణ రింగురోడ్డు నిర్మాణం ఉండనున్నది. ఈ రింగు రోడ్డులో 12 గ్రామాలు బుస్సాపూర్, పుల్లూరు, మల్యాల, గంగాపూర్, మాచాపూర్, చిన్నకోడూర్, రామునిపట్ల, గోనెపల్లి, ఓబులాపూర్, పాలమాకుల, వెంకటాపూర్, బందారం గ్రామాల మీదుగా ఈ రెండు వరసలు రహదారి నిర్మాణం చేయనున్నామ‌న్నారు. నీటి తీరువాను బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం మీటర్లు పెట్టమని రైతుల మెడకు ఉరితాడు పెడుతున్నది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బాయికాడ మీటర్లు పెట్టి 4 శాతం FRBM నిధులు తెచ్చుకున్నది. కానీ తెలంగాణ రాష్ట్ర రైతుల కోసం సీఎం కేసీఆర్ FRBM కింద తెలంగాణకు వచ్చే రూ.25 వేల కోట్లు వద్దనుకుని, రైతుల ప్రయోజనాలు ముఖ్యమని తేల్చిచెప్పారని ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరించాలని ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి పిలుపునిచ్చాం. కేంద్ర బీజేపి ప్రభుత్వం వడ్లు కొనలేదు. కానీ తెలంగాణ ప్రజలను నూకలు తినమని పరిహాసం చేసిందని కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి హరీశ్ మండిపడ్డారు. రైతుబంధు డబ్బులు టింగ్ టింగ్ మని ఫోన్లు మోగుతూ పడుతుంటే రైతుల ముఖాల్లో ఆనందం కనబడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement