Sunday, May 5, 2024

టిఆర్ ఎస్ గెలుపు ఖాయం..

మనోహరాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల గెలుపు ఖాయమని సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు, మనోహరాబాద్‌ సర్పంచ్‌ చిట్కుల మహిపాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 30న జరగబోయే సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికలలో భాగంగా 25వ వార్డులో తెరాస అభ్యర్థి యోగేశ్వర్‌కు మద్దతుగా తూప్రాన్‌ ఉమ్మడి మండల సొసైటీ ఛైర్మన్‌ మెట్టు బాలకృష్ణరెడ్డి, తూప్రాన్‌ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు భగవాన్‌రెడ్డి, జిల్లా నాయకులు పెంటగౌడ్‌లతో సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి తెరాస అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు సూచించారు. ఈ సందర్భంగా మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నట్లు తెలిపారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి కారు గుర్తుకు ఓటువేసి తెరాస అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement