Saturday, May 11, 2024

సోమయాజుల రవీంద్ర శర్మకు..సహస్ర యాగ భూషణ బిరుదు..

తూప్రాన్‌ : వరంగల్‌ నగరంలో తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గ్రేటర్‌ వరంగల్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్ష గాయత్రీ మంత్ర జపయాగ కార్యక్రమంలో భాగంగా దేవీ ఉపాసకులు సహస్ర చండీయాగ దీక్షాపరులు, శ్రీలలితా పరమేశ్వరీ దేవాలయ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సోమయాజుల రవీంద్రశర్మకు సహస్ర యాగ భూషణ బిరుదుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మశ్రీ వెన్నంపల్లి జగన్మోహన్‌శర్మతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement