Saturday, May 4, 2024

దొంగ‌ల హ‌ల్చ‌ల్.. డ్రైవ‌ర్ల‌పై క‌త్తుల‌తో దాడి…

మెదక్ జిల్లాలోని నేషనల్ హైవే 44పై దొంగల హల్చల్ చేశారు. తూప్రాన్ దగ్గర ముగ్గురు దొంగలు జాతీయ రహదారిపై వస్తున్న లారీల డ్రైవర్లపై కత్తులతో దాడి చేశారు. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీలను బైపాస్ కరీంగూడ చౌరస్తా వద్ద టీ తాగేందుకు డ్రైవర్లు నిలిపారు. ఆ సమయంలో దుండగులు చోరీలకు పాల్పడుతున్నట్లు గమనించి అక్కడికి వచ్చారు. ఒక్కసారిగా డ్రైవర్లు అజారుద్దీన్, హైమద్ ఖాన్, నోమల్ ఖాన్‌లపై దుండగులు కత్తులతో దాడి చేసి పరార్ అయ్యారు. ఈ ఘటనపై లారీల డ్రైవర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement