Monday, April 29, 2024

SRD | ఆర్టీసీ కార్మికులు సంబురం.. సంగారెడ్డిలో కేసీఆర్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం

ఉమ్మడి మెదక్ బ్యూరో, (ప్ర‌భ న్యూస్‌): ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు కృతజ్ఞతగా తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్ర‌ప‌టానికి ఇవ్వాల (మంగ‌ళ‌వారం) సంగారెడ్డి జిల్లాలో పాలాభిషేకం చేశారు. సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ కార్మికులు చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం ముఖ్యఅతిథిగా హాజర‌య్యారు. అనంతరం ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర క్రియాశీలకంగా ఉండేదన్నారు. ఆర్టీసీ కార్మికుల దశాబ్దాల కల నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎం, ఆర్ఎం, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement