Tuesday, May 14, 2024

కోడి పందాల స్థావరంపై దాడి 

సంగారెడ్డి : పటాన్ చెర్ మండల పరిధిలోని చిన్న కంజర్ల గ్రామ శివారు ప్రాంతంలోని ఓ పాం హౌస్ లో కోడి పందాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు పోలీసుల‌కు వ‌చ్చిన విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు పటాన్ చెర్ డీఎస్పీ భీమ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల దాడి చేశారు. కోడి పందాల స్థావరంపై జ‌రిపిన దాడుల్లో రూ.10 లక్షలు స్వాధీనం, 32 కోళ్లు, 26 వాహనాలను సీజ్ చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరిని అరెస్ట్ చేయ‌గా.. పరారీలో ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నట్లు సమాచారం. దీని వెనుక ఇంకా ఎవ‌రెవ‌రు ఉన్నార‌నే దానిపై పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement