Monday, May 6, 2024

నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఎమ్మెల్యే మదన్ రెడ్డి

హత్నూర, ప్రభ న్యూస్ : గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు.. రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు, ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండటంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు చిలుముల మదన్ రెడ్డి అన్నారు.

వర్షాల నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రధానంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు తగు జాగ్రత్తలు సూచించాలని అధికారులకు ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులకు గండ్లు పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్తుతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement