Saturday, April 27, 2024

MDK: పద్మా దేవేందర్ రెడ్డి ప్రజలతో చాయ్ భేటీ

మెదక్ ప్రతినిధి, ప్రభ న్యూస్ : జోరు వానను లెక్కచేయకుండా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మెదక్ పట్టణంలోని ఆటోనగర్ లో ప్రధాన రహదారిపై నుంచి పారుతున్న నీళ్లను తొలగించేలా చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా అక్కడే ఉన్న ఓ చిన్న టీ కొట్టులో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి బొగ్గులతో చాయ్ తయారు చేసే యంత్రాన్ని తిప్పి స్వయంగా చాయ్ చేసి తాను తాగుతూ అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, స్థానికులకు తాగించి సందడి చేశారు. వర్షాన్ని లెక్కచేయకుండా పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement