Sunday, May 5, 2024

సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నాలు ముగ్గులు : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు : తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఏకత్వంలో భిన్నత్వంలో కలిసిపోతాయని మైనార్టీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు అబీద్ ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలే ఇందుకు నిదర్శనమని పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని ముత్తంగి గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బీఆర్ఎస్ నాయకులు అబిద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 500 మంది మహిళలు వివిధ రూపాలలో వేసిన ముగ్గులను పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు నిర్వహించుకునే ముఖ్య పండుగలో సంక్రాంతి ఒకటని ఈ పండుగ సందర్భంగా మహిళలకు ప్రతి సంవత్సరము అబిద్ ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు సిహెచ్ ప్రభాకర్ గుప్తా. మాజీ కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ సత్తార్. మేరాజ్ ఖాన్. ఎండి కమురుద్దీన్. ఖాదర్. రవి. ఎండి సోన్ ఖాన్. ఎండి సలీం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement