Thursday, May 2, 2024

వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు..

రామాయంపేట : మండలం కోనాపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన కోవిడ్‌ క్యాంపును ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ వెంకటేశ్వర్లు సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్‌ వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని అందరు కూడా ఈ వ్యాక్సిన్‌ తీసుకోవాలని.. వ్యాక్సిన్‌ ఎంతో సురక్షితం అని అన్నారు. గ్రామంలోని నిరుపేదలకు దోమతెరతో పాటు కొన్ని నిత్యవసర వస్తువుల పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్‌, వార్డు మెంబర్లు, ఉమ్మడి మండలాల వైద్యాధికారి డాక్టర్‌ ఎలిజబెత్‌రాణి, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement