Friday, April 26, 2024

ప్రతి ఇంటికి మిషన్ భగీరథ మంచి నీరు : ఎమ్మెల్యే జీఎంఆర్‌

అమీన్పూర్ : శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా రక్షిత మంచినీరు అందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శ్రీ మల్లికార్జున హిల్స్ లో ఆదివారం ఉదయం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల కనెక్షన్ల ద్వారా మంచినీటి పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలని సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ప్రజల అవసరాల నిమిత్తం రెండు భారీ రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు మంచినీరు అందించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నర్సింహా గౌడ్, బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం కమిటీ చైర్మన్ తులసి రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement