Saturday, April 27, 2024

నర్సింగ్ కళాశాలను సందర్శించిన మంత్రి హరీశ్‌ రావు.. విద్యా బోధనపై ఆరా..

సిద్దిపేట : సిద్దిపేట నూతన నర్సింగ్ కళాశాలను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు బుధవారం సందర్శించారు. మొదటి బ్యాచ్ నర్సింగ్ విద్యార్థులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. నర్సింగ్ తరగతి గదులు సందర్శించి విద్యార్థులకు అందుతున్న విద్య, ప్రాక్టికల్స్ తరగతి నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు.


విద్యార్థులకు అందుతున్న వసతులు, విద్య బోధనపై ఆరా తీశారు. ఈ మేరకు మొదటి బ్యాచ్ నర్సింగ్ విద్యార్థులకు శుభకాంక్షలు తెలిపారు. అంతకుముందు వెల్‌నెస్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వెల్‌నెస్‌ కేంద్రానికి వచ్చే రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై సిబ్బందిని ఆరా తీశారు. ఒకింత సిబ్బందిపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement