Sunday, May 5, 2024

మెద‌క్ జిల్లాలో పలు ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న చేసిన మంత్రి హ‌రీశ్ రావు

రాష్ట్ర ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు మెదక్ లో ప‌ర్య‌టిస్తున్నారు. రూ.4కోట్ల 20 లక్షలతో నిర్మించనున్న గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కళాశాలకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే శివాలయం పక్కన స్వచ్ఛ భారత్ సృష్టికర్త సంత్ గాడ్గే బాబాల విగ్రహాన్నిమంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. మెదక్ పట్టణం వెల్కమ్ బోర్డ్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. అంతకు ముందు రూ.50ల‌క్ష‌ల‌ఖ‌ర్చుతో నిర్మించ‌నున్న దోబీ ఘాటుకు శంకుస్థాపన చేశారు. మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో రూ.44ల‌క్ష‌ల‌తో కొనుగోలు చేసిన స్వీపింగ్ యంత్రాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement