Thursday, April 25, 2024

క‌ర్ణాట‌క‌లో ‘జేమ్స్’ ఫీవ‌ర్ – నాలుగు రోజుల నుంచే ట్రెండ్ సెట్

క‌న్న‌డ స్టార్ పునీత్ రాజ్ కుమార్ న‌టించిన ఆఖ‌రి చిత్రం జేమ్స్. ఈ సినిమాలో ప్రియా ఆనంద్‌ హీరోయిన్‌గా, శ్రీకాంత్‌ విలన్‌ గా నటించారు. అలాగే చేతన్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. పునీత్‌ జయంతి సందర్భంగా అంటే మార్చి 17 వ తేదీన ఈ సినిమా విడు దల కానుంది. అయితే.. సినిమా విడుదలకు 4 రోజులు ఉండగానే.. ట్రెండ్‌ సెట్‌ చేస్తుంది జేమ్స్‌ మూవీ. జేమ్స్‌ సినిమా కనీవినీ ఎరుగని స్థాయిలో ఈ సినిమా కర్ణాటకలో విడుదల అవుతోంది. ఈ సినిమా బుకింగ్స్‌ వారం రోజుల ముందే మొదలు పెట్టారు. అలా ఓపెన చేసిన కొన్ని గంటల్లోనే మొదటి మూడు రోజుల టికెట్స్‌ అన్ని అయిపోయాయి. కర్ణాటకలో ప్రస్తుతం జేమ్స్‌ ఫీవర్‌ నడుస్తోంది. ఎలాగైనా పవర్‌ స్టార్‌ సినిమా మొదటి రోజు చూసేయాలని ఉత్సాహంగా కనిపిస్తున్నారు అభిమానులు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement