Monday, May 6, 2024

ప్రమాదవశాత్తు నీటిలో మునిగి వ్యక్తి మృతి…

పాపన్నపేట : మంజీరాతీరంలో విద్యుత్‌ మోటారు మరమ్మతులకు నోచుకోవడంతో మోటారును వెలికి తీసేందుకు వెళ్లి ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఎల్లాపూర్‌ గ్రామశివారులో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సత్తయ్య (48) అదే గ్రామానికి చెందిన తాడెపు మహిపాల్‌ వ్యవసాయ క్షేత్రం వద్ద మంజీరా తీరంలో ఏర్పాటు చేసిన విద్యుత్‌ నీటి సరఫరా మోటార్‌ మరమ్మతులకు గురికావడంతో మోటారు వెలికితీసేందుకు సత్తయ్యతో పాటు మరో నలుగురు వెళ్లి మంజీరా తీరంలోకి వెళ్లి మరమ్మతులకు లోనైన మోటార్‌ను వెలికి తీసి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు నీట మునిగిపోవడంతో ఈ విషయాన్ని కనిపెట్టిన మరో నలుగురు కూలీలు వెంటనే స్థానికులు, కుటింబీకులు, పోలీసులకు తెలియజేయడంతో పాపన్నపేట ఎస్‌ఐ సురేష్‌ సంఘటన స్థలానికి చేరుకొని మృతుడి మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించి మృతుడి భార్య దుర్గవ్వ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement