Saturday, May 4, 2024

మొక్కలు నాటిన ఎమ్మెల్యే..

పటాన్‌చెరు : ముఖ్యమంత్రి కేసీఆర్‌ తలపెట్టిన హరిత తెలంగాణలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కోరారు. పటాన్‌చెరు పట్టణ పరిధిలోని బయోలాజికల్‌ ఇ లిమిటెడ్‌ సంస్థ ఆద్వర్యంలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ పట్టణీకరణ మూలంగా పచ్చదనం తగ్గిపోతుందని, భవిష్యత్తు తరాలకు స్వచ్చమైన గాలిని అందించాలంటే పెద్దఎత్తు మొక్కలు నాటాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రాములుగౌడ్‌, పరిశ్రమల ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement