Friday, May 17, 2024

ఎమ్మెల్యేకు వినతి పత్రం..

కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం సుభాష్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని సుభాష్‌నగర్‌ ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు, కాలనీవాసులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్‌ని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సుభాష్‌నగర్‌ లాస్ట్‌ బస్టాప్‌ వద్ద బస్‌ షెల్టర్‌ ఏర్పాటు, రూ. 5 భోజనం సౌకర్యం కల్పించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు ప్రజల సౌకర్యార్థం బస్‌షెల్టర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే త్వరలోనే రూ. 5 భోజనం సౌకర్యాన్ని కల్పిస్తామని హమీనిచ్చారు. ఈ కార్యక్రమంలో అడప శేషు, పద్మజరెడ్డి, శ్రీకాంత్‌, నాగిరెడ్డి, పద్మలతరెడ్డి, నాని, అడప శేఖర్‌, బద్రి, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.
పంచతత్వ పార్క్‌, అదనంగా మంచినీటి పైపులైను ఏర్పాటు చేయాలి..
సూరారం డివిజన్‌ పరిధిలోని వైష్ణవి నగర్‌ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కేపి.వివేకానంద్‌ని తన నివాసంలో స్థానిక కార్పొరేటర్‌ మంత్రి సత్యనారాయణతో పాటు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో పంచతత్వ పార్క్‌ ఏర్పాటు, అదనంగా 150 మీటర్ల మంచినీటి పైపులైను ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యేకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పందిస్తూ సంబంధిత అథికారులతో ఫోన్‌లో మాట్లాడారు. కాలనీలో అదనంగా మంచినీటి పై పులైన్‌ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే పంచతత్వ పార్కును కూడా ఏర్పాటు చేస్తామని హమీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్‌ యాదిరెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నర్సయ్య, జనరల్‌ సెక్రటరీ నాగభూషణం, అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement