Saturday, May 18, 2024

కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు..

తొగుట : మండుటెండలో గోదావరి నుండి కూడవెల్లి వాగులోకి నీళ్లు రావడం చాలా సంతోషకరం విషయమని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. రోజున సిద్దిపేట జిల్లా తొగుట మండల చందాపూర్‌ గ్రామ చెక్‌ డ్యాం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు మల్లన్న సాగర్‌ పనులు సైతం అతి త్వరలోనే పూర్తి దుబ్బాక నియోజకవర్గం సస్యశ్యామలం చేస్తామని రెండు మూడు రోజులలో కూడవెల్లి దాక గోదావరి వస్తాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వమని రైతులు సైతం గోదావరి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్య క్రమంలో డిసిసిబి చైర్మన్‌ చిట్టి దేవేందర్‌ రెడ్డి జడ్పీ చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి జడ్పిటిసి ఇంద్రసేనారెడ్డి, వైస్‌ ఎంపీపీ బాసి రెడ్డి గారి శ్రీకాంత్‌ రెడ్డి మార్కెట్‌ కమీటి చైర్మన్‌ గడిల అనిత లక్ష్మారెడ్డి సర్పంచ్‌ పోరం అధ్యక్షుడు గోవర్దన్‌ పగల కొండల్‌ రెడ్డి బోడ్డు నరసింహులు లీలా దేవి వెంకటేశం ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు కంకణాల నర్సింలు రైతుబంధు మండల కన్వినర్‌ కనకయ్య టిఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి నాయకులు పబ్బతి శ్రీనివాస్‌ రెడ్డి బక్క కనకయ్య కొమురయ్య అల్వాల రాజిరెడ్డి, సుభాష్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement