Tuesday, May 21, 2024

మతం పేరుతో రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీని త‌రిమికొట్టాలి : ఎమ్మెల్యే జీఎంఆర్

ప‌టాన్ చెరు : మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా.. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలోని ప్రచార బృందం.. శనివారం చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు, 13వ వార్డులో ప్రచారం నిర్వహించారు. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని ఎమ్మెల్యే జీఎంఆర్ తెలిపారు. మత రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీని ప్రజలు తరిమికొట్టడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement