Thursday, May 2, 2024

ఆటో బోల్తా.. ఒక‌రి మృతి..

మెద‌క్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని కాదులూరు శివారులో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. సోమ‌వారం ఉద‌యం అదుపుతప్పి ఆటో బోల్తా ప‌డ‌గా.. ఈ ప్ర‌మాదంలో ఒకరు మృతి చెంద‌గా మ‌రో ముగ్గురికి గాయాల‌య్యాయి. వెంట‌నే స్థానికులు బాధితుల‌ను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నార్సింగ్ నుంచి కూలి పనుల కోసం బోదంప‌ల్లి వైపు వస్తుండగా కాదులూరు వద్ద అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. అందులో ఉన్న ఉప్పరి కున్నమా అక్కడికక్కడే మృతి చెందారు. గాయ‌ప‌డిన ముగ్గురు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement