Monday, April 29, 2024

గర్భవతిని తాడు సహాయంతో వాగు దాటించిన ఆశా వర్కర్, పంచాయతీ సెక్రటరీ

మెదక్ రూరల్, జులై 27 ప్రభ న్యూస్ : మెదక్ మండల పరిధిలోని మల్కాపూర్ స్కూల్ తాండకు చెందిన దేవసొత్ నవనీత నిండు గర్భిణీ. డెలివరీ కోసం మెదక్ వెళ్ళాలి. మల్కాపూర్ తాండ నుండి మెదక్ వెళ్లే దారిలో మల్కాపూర్ సమీపంలో వాగుపై నుండి నీళ్లు రావడంతో దిక్కుతోచని స్థితిలో పడి ఆశా వర్కర్, పంచాయతీ సెక్రటరీకి సమాచారం అందించారు.

దీంతో వాళ్ళు అక్కడకు వచ్చి తాడు సహాయంతో గర్భిణీని సురక్షితంగా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. మల్కాపూర్ తాండకు బ్రిడ్జి లేకపోవడంతో నానా అవస్థలు పడాల్సి వస్తుందని తాండా వాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా బ్రిడ్జి నిర్మించాలని తాండా ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement