Thursday, May 2, 2024

కాంగ్రెస్ కు మరో ఝలక్.. బీఆర్ఎస్ లో చేరనున్న శశిధర్ రెడ్డి

మెదక్ ప్రతినిధి, ప్రభ న్యూస్ : మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మరో ఝలక్ తగులుతోంది. ఇప్పటికే డిసిసి అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి తిరుపతి రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి జిల్లా మంత్రి హరీష్ రావు ఆహ్వానం మేరకు ఇటీవల తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

ఆయన బాటకొనే మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడానికి రెడీ అవుతున్నారు.ఈ క్రమంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే ,కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు పట్లోళ్ల శశిధర్ రెడ్డి ని బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని స్వయంగా రాష్ట్ర ఆర్ధిక మంత్రి తన్నీరు హరిశ్ రావ్ ఆయన బుధవారం హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి . ఆహ్వానించారు.

శశిధర్ రెడ్డి కుటుంబ సభ్యులతో గంటపాటు చర్చించారు.మీ లాంటి ప్రజా నాయకుడు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే పార్టీ లో సముచిత గౌరవం కల్పిస్తామని శశిధర్ రెడ్డి కి మంత్రి హరీష్ రావు హామీనిచ్చారు. మంత్రి కోరిక మేరకు త్వరలోనే బీఆర్ఎస్ గూటికి శశిధర్ రెడ్డి చేరుతున్నట్లు తెలుస్తోంది.మంత్రి వెంట ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి ,శశిధర్ రెడ్డి సతీమణి సునితమ్మ తో పాటు ఆయన కుటింబికులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement