Thursday, May 2, 2024

రోడ్డుప్రమాదంలో మహిళ మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు.. మెదక్ జిల్లాలో ఘటన

మెదక్ జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని పాపన్నపేట మండలం అన్నారం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు పని నిమిత్తం జిల్లాలోని కొల్చారం మండలం తుక్కాపూర్ గ్రామానికి సంబంధించిన ఆటోలో వ్యవసాయ పనులకు వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్ జరిగినది. అన్నారం గ్రామానికి చెందిన పోచమ్మ (45) అనే మహిళను హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందగా, ఇంకొక ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హైదరాబాద్ హాస్పిటల్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement