Saturday, May 4, 2024

గుర్తుతెలియ‌ని వాహ‌నం ఢీకొని వ్య‌క్తి మృతి…

గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీకొని వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న మెద‌క్ జిల్లాలో చోటుచేసుకుంది. కౌడిపల్లి మండల పరిధిలోని ధర్మసాగర్ గేటు తండాకు చెందిన రామావత్ కైలాస్ (30) అనే వ్య‌క్తిని రాత్రి రెండు గంటల ప్రాంతంలో గుత్తి తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘ‌ట‌న‌లో కైలాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృత‌దేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement