Saturday, May 11, 2024

ఎస్సై రాత పరీక్ష ప్రశాంతం : సీపీ సత్యనారాయణ

ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష రామగుండం, కరీంనగర్ కమిషనరేట్ల పరిధిలో ప్రశాంతంగా జరుగుతోందని పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో ఎస్ఐ రాత పరీక్ష కేంద్రాలను సీపీ పరిశీలించారు. పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద మీడియాతో మాట్లాడుతూ రామగుండం కమిషనరేట్ పరిధిలో పరీక్ష కోసం 24 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో 1719 మంది అభ్యర్థులకు గాను 1590 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరయ్యారన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సీపీ వెంట ఏసీపీ సారంగపాణి, సీఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు రాజేష్, రాజవర్ధన్, మహేందర్ తో పాటు పలువురున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement