Saturday, May 4, 2024

నిఘా నీడలో గ్రామాలు

.. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు… నేరాలు తగ్గే అవకాశం ఉందంటున్న ప్రజలు
రామాయంపేట.. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో దొంగల భయం విపరీతంగా ఉండేది ఏ రోజు ఈ గ్రామంలో దొంగతనాలకు పాల్పడతారు తెలియని భయానక స్థితిలో గ్రామీణ ఈ ప్రాంత ప్రజలు ఉండేవారు కానీ టెక్నాలజీ పెరగడంతో కొందరు దాతల సహకారం మరికొందరు గ్రామం తరపున డబ్బులు వసూలు చేసి సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు అంతేకాకుండా పోలీసులు సైతం తమకు తోచిన విధంగా సహాయం చేస్తూ మండల పరిధిలోని పలు గ్రామాల్లో సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు ఈ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల దొంగతనాలు తగ్గడంతో పాటు ఇతర అసాంఘిక కార్యక్రమాలు కూడా తగ్గే అవకాశం ఉందని ప్రజలు పోలీసులు అంటున్నారు ఈ మధ్యకాలంలో ఓ వ్యక్తి ఇంటి ముందున్న ద్విచక్ర వాహనం ఎత్తుకెళ్లి ఆ వీడియో సీసీ కెమెరాల్లో నమోదైంది దీంతో పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని పట్టుకుని కేసు నమోదు చేయడం జరిగింది మరియు పోలీసులు గ్రామాల్లో సిసి కెమెరాల పట్ల అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు గ్రామాలు ఏర్పాటుచేసిన సీసీ కెమెరా పుట్టే జీ లను ప్రతిరోజు సంబంధిత గ్రామ పోలీస్ అధికారి పర్యవేక్షించడం జరుగుతుంది దీంతో గ్రామాల్లో ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement