Thursday, May 9, 2024

దూప్ సింగ్ తండా బ్రిడ్జి ని ప‌రిశీలించిన ఎస్పీ రోహిణి

ప్రభ న్యూస్ హవేలీ ఘనపురం – మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని హవేలి ఘనపూర్ మండలం లోని వాడి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న దూప్ సింగ్ తండా బ్రిడ్జిని పరిశీలించారు. దూప్ సింగ్ తండా వాసులకు పోచారం డ్యామ్ కు వరద ఉధృతి కావడంతో తాండకు వెళ్లే మార్గమధ్యంలో ఉన్న బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడం వలన తాండవాసులు ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ ఈరోజు బ్రిడ్జి నీ నిర్మించే ప్రదేశాన్ని సంద‌ర్శించారు.

గతంలో మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి సందర్శించినప్పుడు ఐదు కోట్లతో రూపాయలతో నిర్మాణ పనులు చేపడతామని తాండవ వాసులకు మాట ఇచ్చారు. అలాగే పనులు మొదలు కావడంతో వర్షాకాలం రావడంతో ఈ మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మిగిలి ఉన్న మిగతా రోడ్డు వరద ఉధృతి కోతకు గురి కావడంతో తాండావాసులకు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితులను అధికారులు గమనించి సహాయ చర్యలు చేపట్టాలని తనవాసులు కోరుతున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement