Tuesday, May 7, 2024

Breaking | కేసీఆర్​ సీఎం కావడం వల్లే మెదక్​ జిల్లా సాధ్యమయ్యింది: మంత్రి హరీశ్​

ఉమ్మడి మెదక్​ బ్యూరో (ప్రభ న్యూస్​): మెదక్​ జిల్లా కావాలనేది కొన్ని దశాబ్దాల కల.. ఆనాడు ప్రధాని ఇందిరాగాంధీ మాట ఇచ్చారు. ఏండ్లు గడిచాయి కానీ జిల్లా కల నెరవేరలేదు. ఇప్పుడు సీఎం కేసీఆర్​ మాట ఇచ్చారు. అది కొన్ని రోజుల్లోనే నేరవేరింది. జిల్లా పోలీసు ఆఫీసు, కలెక్టరేట్​ భవన సముదాయం, మెడికల్​ కాలేజీ, రైలు అన్నీ మెదక్​కు వచ్చాయి. ఇవన్నీ కేసీఆర్​ సీఎం కావడం వల్ల మాత్రమే సాధ్యమయ్యాయని మంత్రి హరీశ్​రావు అన్నారు. మెదక్​ జిల్లాలో బుధవారం జరిగిన ప్రగతి శంఖారావం సభ ప్రారంభంలో ఆయన ప్రసంగించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీ అభ్యర్థులను పదికి పది మందిని గెలిపించి సీఎం కేసీఆర్​కు కానుకగా ఇద్దామన్నారు. మరోసారి సీఎం కేసీఆర్​ను ఆశీర్వదించాలని మంత్రి హరీశ్​ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement